మాస్ మహారాజా రవితేజ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత సెకండ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 3,4 సంవత్సరాల నుంచి వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు 2021 సంవత్సరం గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా తో గట్టి పోటీ ఇచ్చారు.. ఈ సినిమాలో కాన్సెప్ట్ ప్రేక్షకులకు నచ్చడంతో మాస్ మహారాజా కు పట్టం కట్టారు.. ఇక ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను రాబట్టి మంచి వసూళ్లని రాబట్టింది. క్రాక్ సినిమాతో నిర్మాతలకు కూడా కొన్ని కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పవచ్చు..


ఇక వరుస సినిమాలు రాబట్టుకుని ఓ మంచి ఫామ్లో ఉన్న ఆయన భారీ బడ్జెట్తో ఖిలాడి సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఖిలాడి సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మాస్ మహారాజా మంచి తీపి కబురును చెప్పాడు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది అని చెప్పవచ్చు.


భారతీయ తెలుగు-భాష యాక్షన్ క్రైమ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రమేష్ వర్మ రచించి, దర్శకత్వం వహించారు. ఎ స్టూడియోస్ క్రింద సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను  నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అర్జున్ సర్జా , ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఏదేమైనా ద్విపాత్రాభినయం చేయబోతున్న రవితేజ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి రవితేజని చూడడం కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: