తెలుగులో వరుస మంచి సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తున్న హీరో అడవి శేషు మొదట్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు హీరోగా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు అందరు హీరోలు మాస్ కమర్షియల్ కామెడీ హర్రర్ సినిమాలు చేసుకుంటూ పోతే మాత్రం సినిమాల్లోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సస్పెన్స్ బాగా నమ్ముకొని ఆయన సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన చేయబోతున్న మేజర్ సినిమా కూడా ప్రేక్షకులను భారీస్థాయిలో అలరిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముంబై ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన రాగా ఈ సినిమాపై కూడా ఇది భారీ అంచనాలు పెంచాయని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని తెలుగు హిందీ మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో ఇప్పటివరకు వాయిదా పడుతూ రాగా ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మే 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టు ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ వారితో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి అని చెప్పవచ్చు. ఇక ఈ దర్శకుడితో కలిసి అడవి శేషు గతంలో గూఢచారి అనే సినిమా చేశాడు ఆ చిత్రం మంచి విజయం సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: