శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముంబై ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన రాగా ఈ సినిమాపై కూడా ఇది భారీ అంచనాలు పెంచాయని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని తెలుగు హిందీ మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.
అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో ఇప్పటివరకు వాయిదా పడుతూ రాగా ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మే 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టు ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ వారితో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి అని చెప్పవచ్చు. ఇక ఈ దర్శకుడితో కలిసి అడవి శేషు గతంలో గూఢచారి అనే సినిమా చేశాడు ఆ చిత్రం మంచి విజయం సాధించింది.