సూపర్ స్టార్ మహేష్ ఇటీవల కెరీర్ పరంగా వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని మంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని ఈనెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానుండగా మూవీని మే 12న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల టీమ్ ప్రకటించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే దీని తరువాత త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు సూపర్ స్టార్. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థపై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ఇటీవల జరిగింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి మది కెమెరా మ్యాన్. ఆ తరువాత దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు సూపర్ స్టార్. అందరిలో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్వరలో ఆర్ఆర్ ఆర్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకు రానున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, దానితో పక్కాగా పాన్ ఇండియా హీరోగా పెద్ద సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉండడంతో తప్పకుండా మూవీ భారీ సక్సెస్ కొట్టే అవకాశం కనపడుతోంది. అయితే దీని తరువాత త్వరలో కొరటాల శివ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. ఈ వారంలో ఈ మూవీ ఓపెనింగ్ ఉండనుండగా ఇందులో హీరోయిన్ గా అలియా భట్ నటించనుంది. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ భారీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, యాదృచ్ఛికమో లేక మరేంటో తెలియదుగాని మహేష్, త్రివిక్రమ్ తో చేయనున్న మూవీ తన కెరీర్ 28 వ సినిమా కాగా, అనంతరం రాజమౌళి తో చేయనున్న సినిమా 29వది కానుంది.

అయితే గతంలో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత మూవీ ఎన్టీఆర్ కెరీర్ 28 వ సినిమా కాగా ప్రస్తుతం రాజమౌళి తో చేసిన ఆర్ఆర్ఆర్ 29వది అయింది. కాగా ఈ విధంగా అటు మహేష్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ కెరీర్ 28, 29 వ సినిమాలు ఒకే డైరెక్టర్ తో చేయడం విశేషం. ఇప్పుడు ఇదే అంశాన్ని ఆయా హీరోల ఫ్యాన్స్ తెరపైకి తెస్తూ అన్నదమ్ముల మాదిరిగా టాలీవుడ్ లో ఎన్టీఆర్, మహేష్ దూసుకెళ్తున్నారని, రాబోయే రోజుల్లో వారు మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని కోరుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: