మహానటి
కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాలు ఎందుకు చేయడం లేదనే విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ సమాధానంగా ఆమె మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తుంది. మొదట్లో హీరోల పక్కన సినిమాలు చేసి భారీ స్థాయిలో హిట్లు అందుకొని టాప్
హీరోయిన్ గా ఎదిగింది.
నేను శైలజ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై
హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత
నాని సరసన
నేను లోకల్ సినిమాలో నటించి టాప్
హీరోయిన్ గా మారిపోయింది.
ఇక అప్పుడు ఆమె చేసిన
మహానటి చిత్రం దేశ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడంతో ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే విధంగా ఆసక్తి చూపించింది. అయితే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం వల్ల ఆమె క్రేజ్ ఒక్క సారిగా దిగజారి పోయింది అని చెప్పవచ్చు. గతంలో కొంతమంది హీరోయిన్లు చేసిన పని ఏమి చేయకపోవడమే ఆమె ఇప్పుడు ఆమె క్రేజ్ తగ్గిపోవడానికి కారణం. ఎంత హిట్స్ వచ్చినా కూడా హీరోల సరసన నటిస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో చేశారు కొంతమంది హీరోయిన్లు.
అయితే
కీర్తి ఆ సినిమాలలో నటించడం మాత్రమే చేయడంతో ఆమెకు అభిమానులు పెరగక పోగా క్రేజ్ తగ్గిపోయిందని చెప్పవచ్చు. పోనీ వాటి ద్వారా ఆమెకు హిట్లు వచ్చాయ అంటే అది కూడా కాదు. భారీ ఫ్లాప్ లు కావడంతో ఆమె స్థానం రోజు రోజుకీ కిందకి వెళ్ళిపోయింది. ఇటీవలే సఖి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన
కీర్తి కి ఈ
సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు కమర్షియల్ హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్కారు వారి పాట సినిమాలో ఈమె మంచి పాత్ర చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ
సినిమా తప్పకుండా తనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని భావిస్తుంది. కాబట్టి ఈ చిత్రంతో మళ్లీ ఆమె
సినిమా అవకాశాలు దక్కించుకొని అగ్రహీరోయిన్ గా కొనసాగాలని చూస్తుంది