సీనియర్ నటుడు అయిన మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం ఫిబ్రవరి 18న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోందని తెలుస్తుంది... ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

ప్రీరిలీజ్ ఈవెంట్ కు నటుడు మరియు దర్శకుడు అయిన పోసాని కృష్ణమురళి కూడా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో పోసాని ఎప్పటిలాగే తనదైన శైలిలో ప్రసంగించారట.ఈ సందర్భంగా పోసాని చేసిన సంచలన వ్యాఖ్యలు అంతటా కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ పోసాని కృష్ణమురళి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్న సమయంలో మోహన్ బాబు గారితో పరిచయం ఏర్పడింది అని అన్నారట.. 

పరుచూరి బ్రదర్స్ నాకు జీవితాన్ని ఇచ్చారని వాళ్ళ దగ్గర ఐదేళ్లపాటు పనిచేశా చాలా నేర్చుకున్నా కానీ నేను పరుచూరి బ్రదర్స్ లాగా మాత్రం బతకాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.వాళ్ళు బతకడం తెలియని మనుషులు అని పోసాని అన్నారట..పరుచూరి లాంటి వాళ్ళని ఇండస్ట్రీ ఎక్కడ పెట్టిందో నాకు బాగా తెలుసు. పరుచూరి, ఆత్రేయ మరియు వేటూరి లాంటి వాళ్ళని చూసి ఈ బతుకు నాకు వద్దు అని అనుకున్నా అని చెప్పుకొచ్చారు.


చనిపోతే కనీసం పది మంది రాని ఇండస్ట్రీ గురించి నాకు బాగా తెలుసు. నన్ను ఇండస్ట్రీ బహిష్కరించినా కూడా పర్వాలేదు. నేను.. నా కొడుకులు మరియు మనవళ్లు బాగా బతికేంత సంపాదించానని కొందరికి మందు పోసి చికెన్ ముక్కలు అందించే బతుకు నాకు అస్సలు వద్దు అంటూ పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారట.. 


పోసాని వ్యాఖ్యలు గమనిస్తే ఎవరినో ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్స్ లాగా మనకు అనిపిస్తాయి. మోహన్ బాబు మరియు చిరంజీవి మధ్య ఇండస్ట్రీలో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.మోహన్ బాబు సినిమా ఫంక్షన్ లో పోసాని చేసిన ఈ కామెంట్స్ సరికొత్త చర్చకు దారితీశాయని తెలుస్తుంది.. ఇందులో పోసాని పదేపదే పరుచూరి బ్రదర్స్ పేర్లని ఎత్తడం మరింత హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: