ప్రభాస్ కథానాయకుడిగా పూజా హెగ్డే కథానాయకుడిగా ఒక యాక్షన్ డ్రామా, లవ్, ఎమోషనల్ గా తెరకెక్కుతున్న మూవీ రాధే శ్యామ్. ఈ సినిమాతో సరికొత్త కథ తో, ప్రేక్షకులను, అభిమానులను సర్ ప్రైజ్ చేయబోతున్నాడు ప్రభాస్. కోవిడ్ కారణంగా ఈ మూవీ కూడా పలుసార్లు వాయిదా పడడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ లాంచ్ వంటివి జరగడం జరిగింది.. ఇక ఈ ఏడాది మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిత్రబృందం. అయితే ఈ రోజును వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ రావడం జరుగుతోంది. వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.


ఇక ఈ సినిమా లవ్ ఎమోషనల్ తో కూడిన సినిమా కాబట్టి.. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ట్రీట్ లేకుండా ఎలా అని చిత్ర బృందం అనుకోవడం తో ఒక సర్ ప్రైజ్ ను ప్లాన్ చేసింది.. ఇక ఈ రోజు మధ్యాహ్నం 1:45 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు గా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్లు కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఇక ఆ పోస్టర్ విషయానికి వస్తే మొత్తం పింక్ కలర్ తో నిండిపోయి అందులో పూజా హెగ్డే కూడా అదే రంగులో కనిపిస్తూ చిరునవ్వుతో కనిపిస్తున్నది.


ప్రభాస్ మాత్రం ఏదో ఒక ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ప్రభాస్ ఈ మూవీలో ఒక హస్త సాముద్రిక  నిపుణుడు గా కనిపిస్తున్నాడు. మరి తన జీవితంలో, లవ్ విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనే విషయాన్ని మాత్రం ముందుగానే ప్రభాస్ గుర్తించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించడం జరిగిందట. ఇక విధికి, ప్రేమకి మధ్య ఎలాంటి పోరాటం జరుగుతుంది అనే విషయం తెరమీద చూడాల్సిందే. ఇక ఈ మూవీకి రాధాకృష్ణ డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: