ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది జబర్దస్త్ కార్యక్రమం.  ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెర చరిత్రలోనే టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కోట్ల మంది తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ అందరికీ కాస్త ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది ఈ కార్యక్రమం. జబర్దస్త్ కామెడీ ని మరింత రెట్టింపు చేసేందుకు ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమం కూడా ప్రారంభించారు. అయితే బుల్లితెర ప్రేక్షకులందరికీ కామెడీ పంచి కడుపుబ్బ నవ్వించడమే కాదు ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమందికి జబర్దస్త్ కార్యక్రమం ఒక మంచి వేదికగా మారిపోయింది.


 ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్ లతో తెర మీదికి వచ్చే జబర్దస్త్ కమెడియన్స్ ఎప్పుడు వినూత్నమైన కామెడీని పంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల వచ్చేవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  ఈ ప్రోమో ఎప్పటిలాగానే సందడి సందడి గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈసారి జబర్దస్త్ లో జడ్జిగా మనో ప్లేస్ లో అలనాటి హీరోయిన్ ఆమని ఎంట్రీ ఇచ్చింది.


 జబర్దస్త్ ప్రోమో లో భాగంగా ఎప్పటిలాగానే కమెడియన్స్ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇక ఈ సారి సుడిగాలి సుధీర్ టీం సరికొత్తగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సుధీర్ పెళ్లి చేసుకోవాలంటే ఏడు తరాల వాళ్ళని చూడాలి అంటాడు అతని మామ. ఈ క్రమంలోనే ఇక నాల్గవ తరం వాళ్ళు రావాలి అంటే క్లాత్ పట్టుకోవాలి అంటూ చెబుతాడు సుడిగాలి సుదీర్. ఇలా ఒక క్లాత్ పట్టుకోగానే స్టేజి వెనుక నుంచి నగ్నంగా జబర్దస్త్ కమెడియన్స్ స్టేజి మీదకు వస్తారు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక రష్మీ వెంటనే యాంకర్ సీట్ లో నుంచి లేచి నిజంగానే నగ్నం గా ఉన్నారా లేదా అని తొంగి తొంగి చూస్తుంది. దీంతో అందరూ తెగ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: