తాజాగా పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన 'భీమ్లా నాయక్' .ఈ సినిమా శుక్రవారం ఫిబ్రవరి 25 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్, ప్లే డైలాగ్స్ అందించగా.. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. అయితే సినిమా విడుదల కంటే ముందే పాటలు, ట్రైలర్స్ తో సినిమా మీద హైప్ పెరిగింది.ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా భారీ విజయం సాధించింది.

అంతేకాదు  తెలుగు రాష్ట్రాల్లో నిన్న పవన్ అభిమానులు హంగామా చేశారు.కాగా ఇక మొదటిరోజు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయని సమాచారం. అయితే 'భీమ్లా నాయక్' సినిమా చూసి పలువురు స్టార్లు, సెలబ్రిటీలు పవన్, రానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా  'రిపబ్లిక్' సినిమాతో హిట్ కొట్టిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా కూడా 'భీమ్లా నాయక్' సినిమా చూసి స్పెషల్ ట్వీట్ చేయడం జరిగింది.అయితే తమిళనాడులో కూడా పవన్ సినిమాకి అభిమానులు హంగామా చేసిన ఓ వీడియోని షేర్ చేసి.. 'బాహుబలి తర్వాత ఇది మన తెలుగు సినిమా. అంతేకాకుండా భాష, సరిహద్దులు లేకుండా అందరిని కలుపుకుంటూ వెళుతుంది. 

ఇకపోతే ఏ ఫోర్స్ తెలుగు సినిమాని ఆపలేదు. అయితే 'భీమ్లా నాయక్'తో సూపర్ సక్సెస్ అందుకున్న ఉస్తాద్ పవన్ కళ్యాణ్ మరియు రానాలకు, చిత్ర యూనిట్‌కి నా శుభాకాంక్షలు' అని పోస్ట్ చేయడం జరిగింది. దీంతో దేవాకట్టా భీమ్లా నాయక్ సినిమాపై చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్తో రిపబ్లిక్ సినిమా తీసిన దేవకట్టా.. ఈ సినిమాకు కొనసాగింపుగా రిపబ్లిక్ పార్ట్ 2 ని పవన్ కళ్యాణ్ తో తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవాకట్టా స్వయంగా చెప్పడం గమనార్హం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: