తమిళ సినీ ఇండస్ట్రీలో సుందరి ప్రశాంత్ హీరోగా చేసిన జోడి అనే సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలిగా ఒక చిన్న పాత్ర పోషించింది.. అలా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నాల్గవ సినిమా హీరో విక్రమ్ సరసన నటించే అవకాశాన్ని సంపాదించుకుంది.. తన ప్రతిభతో వేగంగా అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగులో వర్షం సినిమాతో ప్రేక్షకులను అలరించి.. ఇక వరుస తెలుగు సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా అనతికాలంలోనే ఎదిగిపోయింది. ఏ స్టార్ హీరో తో జత కడితే ఆ సినిమా విజయం సాధించింది. ప్రతి పాత్రతో కూడా ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంది.
ఇక ద్విభాషా చిత్రం అయిన నాయకి సినిమాను పక్కనపెడితే .. 2015 లో బాలకృష్ణ నటించిన లయన్ సినిమా తెలుగులో చివరి సినిమా అని చెప్పవచ్చు. తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లీడ్ రోల్ చేసిన రాంగి, గర్జనై సినిమాలు కూడా త్వరలోనే విడుదల అవుతున్నాయి. ఇకపోతే ఈమె చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నా.. ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది . కానీ ఇవి మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈమెకు తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఎక్కడా కూడా అవకాశాలు లేకపోవడం గమనార్హం. ఈమె కాదు ఈమె తో పాటు అనుష్క, నయనతార వంటి వారు కూడా తెలుగులో కనిపించకపోవడం ఒక రకంగా బాధాకరం అని చెప్పవచ్చు.