అందాల ముద్దుగుమ్మ బిందు మాధవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ ఆవకాయ బిర్యాని,  రామ రామ కృష్ణ కృష్ణ వంటి తెలుగు సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది,  కాకపోతే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో బిందు మాధవి కి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్దగా అవకాశాలు దక్కలేదు,  అయితే ఆ తర్వాత బిందు మాధవి కన్నడ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

  అక్కడ బిందు మాధవి కి అవకాశాల తో పాటు క్రేజీ కూడా బాగానే వచ్చింది,  ఇలా కన్నడ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బిందు మాధవి కన్నడ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది.  ఇది ఇలా ఉంటే బిందు మాధవి ప్రస్తుతం తెలుగు 'ఓ టి టి'  బిగ్ బాస్ లో పాల్గొంటుంది,  ఈ సందర్బంగా బిందు మాధవి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది... కన్నడ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాను, ఆ సమయం లో నేను డిప్రెషన్ లో ఉన్నాను. కానీ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చే సరికి డిప్రెషన్ నుండి  బయటకు వచ్చాను, నా స్వస్థలం చిత్తూరు లోని మదనపల్లి. బిగ్‌ బాస్‌ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటున్నాను'  అని  బిందు మాధవి చెప్పుకొచ్చింది. బిందు మాధవి మస్తీ ట్యాగ్‌ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి బిందు మాధవి తెలుగు 'ఓ టి టి'  బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: