హీరో శర్వానంద్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.. అందుకు సంబంధించిన లైవ్ అప్డేట్ కూడా ప్రసారం అవుతూ ఉండడం గమనార్హం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే మార్చి 4వ తేదీన చాలా గ్రాండ్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా లాంఛనంగా రిలీజ్ చేయబోతున్నారు.


తాజాగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ కనకాల హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తన వాక్చాతుర్యంతో అక్కడున్న ఆడియన్స్ ని అందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఈవెంట్ కు హాజరయిన అతిథులను కూడా బాగా ఆలరిస్తూ ఉండటం గమనార్హం.. ఒక ఝాన్సీ,  ఖుష్బూ కూడా సందడి చేయడం జరిగింది. అంతే కాదు ఝాన్సీ .. ఖుష్బూ గురించి మాట్లాడుతూ ఎవరైనా సరే ఫిట్నెస్ గోల్స్ పెట్టుకుంటారు కానీ కుష్బూ తో పని చేస్తే మాత్రం బ్యూటీ గోల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.. నిజ జీవితం లో జరిగే సన్నివేశాలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం.


ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడానికి మార్చి 4వ తేదీన మీ ముందుకు వస్తున్నాను అంటూ ఝాన్సీ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా వేదిక మీద వెల్లడించడం జరిగింది. శిల్పకళావేదికలో గ్రాండ్గా జరుగుతున్న ఈవెంట్ కి సాయి పల్లవి, కీర్తి సురేష్ కూడా ముఖ్య అతిథులుగా హాజరు కావడం గమనార్హం. ఇక ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ సీనియర్ హీరోయిన్లు నటించిన సందడి చేసిన విషయం తెలిసిందే ఇక అందరూ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు కాబట్టి మనం కూడా ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: