కిరణ్ అబ్బవరం.. రాజావారు రాణిగారు , ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించిన ఈయన తాజాగా సెబాస్టియన్ పి సి 524 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్నారు.. పల్లె వాతావరణానికి.. స్వచ్ఛమైన ప్రేమ కథకు పెద్ద పీట వేస్తూ పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో రేచీకటి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది.. ఇక పోతే కిరణ్ అబ్బవరం చేసింది రెండు సినిమాలే అయినా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఏ హీరో కూడా చెయ్యని సాహసం గా.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ కుర్రహీరో.

ఇక తాజాగా రేచీకటి అనే కొత్త కాన్సెప్టుతో ఈ కథను ఛాలెంజ్గా తీసుకొని తెరకెక్కించడం జరుగుతోంది ఇకపోతే ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోవిత సినిమాస్ పతాకంపై ఈ సినిమాను బి. సిద్ధారెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం గమనార్హం. ఇకపోతే సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక దర్శకుడిగా ఈ సినిమాకు మొదటి సారి బాలాజీ సయ్యపురెడ్డి పరిచయమవుతున్నారు. ఇక సహనిర్మాతలు గా ప్రమోద్ జయచంద్రారెడ్డి రాజు వంటి వారు వ్యవహరిస్తున్నారు.

ఇద్దరు హీరోయిన్ లు కోమలి ప్రసాద్ , నమ్రత దారేకర్ వంటి వారు నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 4వ తేదీన థియేటర్లలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే ఇందుకు సంబంధించి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ట్రైడెంట్ హోటల్ లో సినీ అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ప్రముఖులుగా వెంకీ కుడుముల , వేణు శ్రీరామ్, అడవి శేషు, ఆకాష్ పూరి, సాయి కుమార్ తో పాటు మరి కొంతమంది సినీ పెద్దలు హాజరవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: