బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మైంట్ సాగుతుందట.

కొద్ది రోజుల క్రితం షో మొదలు కాగా ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇక, వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చారు.
ఇక, ఈ సీజన్‌ను బుల్లితెరపై కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రీమియర్ ఎపిసోడ్‌లో అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ అలాగే ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చారు.

వీరిలో తెలుగు హీరోయిన్ బిందు మాధవే అని చెప్పాలి. దీనికి కారణం ఆమె బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లడమేనట అంతేకాదు, అక్కడ ఆమె చక్కని ఆటతీరుతో ఫినాలే వరకూ వెళ్లిందట. దీంతో ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది.చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన బిందు మాధవి ‘ఆవకాయ్ బిర్యానీ’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో కూడా నటించింది.

ఈ క్రమంలోనే ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉన్న తమిళ బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫినాలే వరకూ వెళ్లిందట.ఈ విషయాన్ని వెల్లడించిన నాగార్జున.. ఆమెను ఎంతగానో ప్రశంసించాడని తెలుస్తుంది.బ్రేకప్ అయి డిప్రెషన్‌లో ఉన్న సమయంలోనే తమిళ బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాక కాస్త కోలుకున్నానంటూ బిందు మాధవి చెప్పుకొచ్చిందట..

అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిందు మాధవి తన పర్సనల్ విషయాలను బయటపెట్టేసిందట. టాస్కులో భాగంగా బిందు మాధవికి తన రిలేషన్ గురించి చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన తొలి ప్రేమ సంగతులను తెలిపిందట. కాలేజ్ టైంలో ప్రేమించుకున్నామని, అయితే కెరీర్ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని, తను చదువుల కోసం యూఎస్ వెళ్లిపోయాడని, తాను ఇలా సినీ రంగంలోకి వచ్చేశాను అని చెప్పేసిందట.కానీ ఆ రిలేషన్ మాత్రం తనకు ఎప్పటికీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. అతని పేరుని మాత్రం ఆమె చెప్పలేదు. ఇప్పుడు అతడికి పెళ్లి అయిపోయిందంటూ బిందు మాధవి తెలిపిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: