స్టార్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.లాంగ్ రన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించడం విశేషం.చాలా సంవత్సరాల తర్వాత అఖండ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిందని తెలుస్తుంది.. ఈ సినిమా సీడెడ్ ఏరియాలో ఏకంగా 15 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.

నాలుగు జిల్లాలు ఉన్న సీడెడ్ ఏరియాలో ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడం మాత్రం అంత సులువు కాదు. అయితే సీడెడ్ లో బాలయ్యకు భారీస్థాయిలో అభిమానులు ఉన్నారట.సీడెడ్ లోని హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ ఏరియాలో హిట్ టాక్ వస్తే బాలయ్య సినిమా కలెక్షన్లు మామూలుగా ఉండవని పుష్ప సినిమా ఫుల్ రన్ లో సీడెడ్ లో సాధించిన కలెక్షన్లతో పోలిస్తే అఖండ సినిమా సీడెడ్ కలెక్షన్లు ఎక్కువ కావడం విశేషం.

 

భీమ్లా నాయక్ సినిమా కూడా ఫుల్ రన్ లో సీడెడ్ కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశాలు అయితే లేవని చెప్పవచ్చు.. సీడెడ్ ఏరియాకు మాత్రం బాలయ్యే రాజు అని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య నటించిన అఖండ అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా పుష్ప సినిమా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందట.అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లను వెనక్కు నెట్టి స్టార్ హీరో అయిన బాలకృష్ణ ముందువరసలో నిలవడం విశేషం.

 

బాలయ్య తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: