పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సినిమాకి కొంత మిక్స్ డ్ టాక్ తో పాటు సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ కూడా జరుగుతుంది. కొంతమంది రాధేశ్యామ్ సినిమా హిట్ అని చెబుతుంటే.. మరికొంతమంది ఫ్లాప్ అని కూడా అంటున్నారు. ప్రత్యేకంగా ఒక వర్గం అయితే విడుదలైన ప్రతి సినిమాకీ నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

అయితే ఇదిలా ఉంటే తాజాగా రాదేశ్యామ్ సినిమాపై మరియు ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది నటి పూనమ్ కౌర్. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ...' ఇండస్ట్రీలో స్టార్లు చాలామంది ఉన్నారు. యాక్టర్లు చాలామంది ఉన్నారు. కానీ మన భారత దేశంలో మనుషుల్ని నమ్మి ఐదు సంవత్సరాలు ఒకే ఒక్క మూవీకి అది కూడా ప్రైమ్ టైం లో కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన లుక్స్ గురించి కాదు క్రేజ్ గురించి కాదు వ్యక్తిత్వం గురించి నమ్మిన వాళ్ళకోసం నిలబడడమే ఆయన క్యారెక్టర్ అంటూ ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించింది పూనమ్.

బాహుబలి సినిమా తో రికార్డులను బ్రేక్ చేస్తూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారని పూనమ్ కౌర్ తెలిపింది.ఇక ఆ తర్వాత రాధేశ్యామ్ గురించి మాట్లాడుతూ.. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. వాటిలో ఇండియన్ లవ్ స్టోరీస్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతాను. రరాధేశ్యామ్ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ. సినిమా నాకు నచ్చింది' అంటూ పూనమ్ కౌర్ పేర్కొంది. అంతేకాకుండా ట్రైలర్ లో ఆయన కుర్చీలో కూర్చుని చెప్పిన డైలాగ్ కూడా నాకు బాగా నచ్చిందని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ప్రభాస్ పై పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: