దక్షిణాది అగ్ర కథానాయకుల పేరు పొందింది సమంత. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో తన జీవితాన్ని బిజీబిజీగా గడిపేస్తున్నది. చివరగా జాను చిత్రంతో ఇమే తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాని ఈ ముద్దుగుమ్మ చేయలేదు. కానీ పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఇక ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ నటించినది. ఈ సీరీస్ సక్సెస్ కావడంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రేజ్ తో ప్రస్తుతం ఈమెతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.


సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం అనే ఒక చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తున్నారు. అందుకోసం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా శర వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం కంటే ముందుగా సమంత ఒక డబ్బింగ్ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్ర ఏదో కాదు "కాదువాక్కుల రెండు కదల్"ఈ సినిమాని తెలుగులో ''కణ్మణి రాంబో ఖతీజా "అనే సినిమా టైటిల్ తో తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇందులో నయనతార విజయ్ సేతుపతి, సమంత పాత్రలకు తగ్గట్టుగా ఈ చిత్రం టైటిల్ ని పేర్కొన్నట్లు సమాచారం.

''కణ్మణి రాంబో ఖతీజా "ఈ సినిమా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయగా.. దీంతో ఈ టైలర్ పై ఎలాంటి బజ్ ఏర్పడ లేదట. ఇక ఇలాంటి సినిమా ఒకటి విడుదల అవుతోందని సినిమా ట్రైలర్ విడుదల అయ్యే వరకు ఎవరికీ తెలియలేదట. గతంలో కూడా జానుట్ సినిమా  ఫ్లాప్ ను చవి చూసింది. ఇక ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: