పవన్
కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇటీవల భీమ్లా
నాయక్ సినిమాని విడుదల చేసి ఘన విజయాన్ని అందుకున్న పవన్
కళ్యాణ్ ఆ తర్వాత చిత్రంగా
క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహరన్ విడుదల చేయబోతున్నారు. ఈ
సినిమా కూడా ప్రేక్షకులను భారీగా అలరించే సినిమాల్లో ఒకటి కావడం విశేషం. చారిత్రాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను క్రిష్ ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది
.
ఇక ఈ చిత్రం తర్వాత
హరీష్ శంకర్ దర్శకత్వంలో
పవన్ కల్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ అనే
సినిమా కూడా చేస్తున్నాడు.
మాస్ మసాలా యాక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ భారీ అంచనాలకు కారణం వీరి కాంబో గతంలో
గబ్బర్ సింగ్ అనే చిత్రం రావడం అని అందరికి తెలిసిందే. ఆ
సినిమా పవన్ కు మంచి కం బ్యాక్ హిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పవన్
కళ్యాణ్ ఈ దర్శకుడితో
సినిమా చేయలనే డిమాండ్ ఏర్పడగా దానికి కోసంఇంత సమయం పడుతుంది అని ఎవరు అనుకోలేదు.
ఈ
సినిమా తర్వాత కూడా
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరియు
సుజిత్ దర్శకత్వంలో
పవన్ కల్యాణ్ తో ఓ
సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే పవన్
కళ్యాణ్ ఇలా సినిమాలు ఒప్పుకుంటే పోవడం పట్ల ఈ చిత్ర దర్శకులు కొంత టెన్షన్ పడుతున్నారు.
సినిమా షూటింగ్ మొదలు పెట్టడం లో వెనకడుగు వేస్తున్నారు పవన్ ఇదే సమయంలో వరుస సినిమాలు ఒప్పుకోవడం పట్ల టెన్షన్ ఫీల్ అవుతున్నట్లు వారు తమ తన సన్నిహితులతో చెబుతున్నాడట. పవన్
కళ్యాణ్ మరో
రీమేక్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ
సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.