పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నది.. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ పాన్ ఇండియా ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకున్నది.

కరోనా కారణంగా కొన్నాళ్లుగా వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోందట టీమ్. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ చిత్రం షూట్ ఏప్రిల్ 8 నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని సమాచారం.

పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇదే. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారని తెలుస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం చిత్రంను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక అది అలా ఉంటే ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని సమాచారం.


గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్సినిమా కోసం పలు విన్యాసాలు కూడా చేస్తున్నారు. ఆయన డెడికేషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సన్మానించారట. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా వైరల్‌గా మారా యి.

ఇక మరోవైపు పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోదయ సీతమ్ రీమేక్‌లో నటించనున్నారట.. ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి ధరమ్ తేజ్ మరో కీలకపాత్రలో నటించనున్నారని తెలుస్తుంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారట. సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ విషయానికి వస్తే… ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి మాటలు మరియు కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: