టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సంపత్ నంది దర్శకత్వంలో   వచ్చిన సీటీమార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఈ మ్యాచో హీరో.. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పక్కా కమర్షియల్'. సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా రాశికన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. పక్కా కమర్షియల్ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ తెలుగు ఓటీటీ ఈ సంస్థ ఆహా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా థియేటర్ లో విడుదలైన కొన్ని వారాల తరువాత ఆహలో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రానికి జోక్స్ బేజాయ్ సంగీతం అందించగా... సినిమాలో రావు రమేష్, సత్య రాజ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా గోపీచంద్ కెరీర్లో 29వ సినిమాగా రాబోతోంది. ఇక సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడగా.. విడుదల తర్వాత ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.ఈ సినిమా అనంతరం శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తన 30వ సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో గోపీచంద్ మరో సినిమాని కూడా లైన్లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: