ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీ లోని వాళ్ళకు పోలీసులు భారీ షాక్ ఇస్తూ ఇస్తున్న తెలిసిందే. ప్రముఖుల కార్లకు బ్లాక్ ఫిలిం ఉండటం తో వారి కార్లకు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.. మొన్నీమధ్య హీరో ఎన్టీఆర్, అల్లు అర్జున్ కారుకు కూడా జరిమానా వేసి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో ప్రముఖ హీరో కారుకు కూడా భారీ జరిమానా విధించినట్లు తెలుస్తుంది. తెలుగు హీరో అక్కినేని నాగ చైతన్య కారుకు ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇది వార్థల్లొ సంచలనంగా మారింది..


చైతన్య కారుకు ఫిలిం ఉండటం తో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం అతడి వాహనాన్ని ఆపి రూ.700 జరిమానా విధించారు. ఆ సమయంలో నాగచైతన్య కారులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కల్యాణ్‌ రామ్‌, మంచు మనోజ్‌ కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్ముల ను తొలగించి మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద వారికి రూ.700 చొప్పున చలాన్లు విధించిన విషయం అందరికి తెలుసు. వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాల కు బ్లాక్‌ ఫిలిం ను వినియొగించ రాదని గత నెలలో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే..


ఈ మేరకు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తూ కారు అద్దాలకు టింటెడ్‌ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తూ వాటిని తొలగిస్తూ వస్తున్నారు.. ఇక పోలీసుల చేతికి ఇంక ఎ హీరో చిక్కుతాడో చూడాలి.. నాగచైతన్య సినిమాల విషయాన్నికొస్తే.. ప్రస్తుతం బంగర్రాజు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరో సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. మరోవైపు నాగ చైతన్య, సమంత మళ్ళీ కలవబోతున్నారని  సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో ఎంత నిజం వుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: