పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ 50 శాతం వరకు పూర్తి అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమా పై ఫోకస్ పెట్టడం, క్రిష్ జాగర్లమూడి కొండపొలం సినిమాపై ఫోకస్ పెట్టడంతో హరిహర వీరమల్లు సినిమా కొంత కాలం పాటు తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్,  కొండపొలం సినిమా పనులు ముగియడంతో తిరిగి హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ కొంత కాలం క్రితమే మొదలు అయ్యింది. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అయ్యింది. తాజా షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలోని ప్రధాన పాత్రధారులుపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.  హరిహర వీరమల్లు మూవీ తాజా షెడ్యూల్ మే రెండవ వారం నుండి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

జూన్ నెలతో ఈ సినిమా షూటింగ్  పార్ట్ ను పూర్తి చేసేలా చిత్ర బృందం పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ లో అర్జున్ రాంపాల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అలాగే హరిహర వీరమల్లు మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఈజిప్ట్ క్వీన్ గా కనిపించబోతున్నట్లు ఒక వార్త నెటింట్లో  వైరల్ అవుతుంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో హరిహర వీరమల్లు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: