టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుల్లో ఒకరు అయిన సంపత్ నంది గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  సంపత్ నంది 'ఏమైంది ఈ వేళ'  అనే సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ని మొదలు పెట్టాడు.  వరుణ్ సందేశ్  హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఏమైంది ఈ వేళ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపత్ నంది కి దర్శకుడిగా మంచి క్రేజ్ లభించింది.  ఆ తర్వాత సంపత్ నంది కి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది.  అందులో భాగంగా సంపత్ నంది , రామ్ చరణ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా రచ్చ సినిమాను తెరకెక్కించాడు.  

సినిమా మంచి విజయం సాధించడంతో సంపత్ నంది మాస్ దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత సంపత్ నంది పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.  సంపత్ నంది కొన్ని రోజుల క్రితం గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన సిటిమార్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.  ఈ సినిమా విడుదల అయి చాలా కాలం అవుతున్న ఇప్పటి వరకు సంపత్ నంది తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం సంపత్ నంది , సాయి ధరమ్ తేజ్ తో తన తర్వాతి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.  సాయి ధరమ్ తేజ్ ఓ మూవీ ని భోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో చేస్తున్నారు. దాని తరువాత పీపుల్స్ మీడియా సినిమా చేయాల్సి వుంది. ఆ తర్వాత సంపత్ నంది ,  సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో  సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: