టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మంచి నటులలో ఒకరు అయినా సత్యదేవ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి సత్యదేవ్ ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. అలాగే తన నటనతో ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి కూడా సత్యదేవ్ ప్రశంసలను అందుకున్నాడు. ఇలా ఒక మంచి నటుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సత్యదేవ్ తాజాగా గాడ్సే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా, ఈ మూవీకి గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించాడు.

ఇది వరకే సత్యదేవ్ , గోపి గణేష్ పట్టాభి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ మాస్టర్ సినిమా అటు ప్రేక్షకుల నుండి, ఇటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలను పొంది మంచి విజయం సాధించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు తెరకెక్కిన బ్లాఫ్ మాస్టర్ సినిమా మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన గాడ్సే మూవీ పై  ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ రేపు అనగా జూన్ 17 వ తేదీన థియేటర్ లలో  విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.

నైజాం 1.3 కోట్లు , సీడెడ్ 40 లక్షలు , ఆంధ్ర 1.80 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో గాడ్సే మూవీ 3.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్  ను జరుపుకుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలిపి గాడ్సే మూవీ కి 1 కోటి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా గాడ్సే సినిమాకు 4.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, 5  కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: