టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అల్లు అర్జున్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అల్లు అర్జున్ తాజాగా నటించిన పుష్ప మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. రావు రమేష్ , సునీల్ ,  అనసూయ  ఇతర ప్రధాన పాత్రలో నటించగా,  మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ నెల విడుదల అయిన పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇక పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి  చిత్ర బృందం అంతా సిద్ధం చేస్తుండగా తాజాగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను విడుదల చేశారు.

మూవీ లో నటించే అవకాశం ఉంది అని ఒక ప్రకటనను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ ప్రకటనలో భాగంగా ఈ సినిమాలో నటించాలి అంటే చిత్తూరు యాస కచ్చితంగా వచ్చి ఉండాలి అని చిత్ర బృందం ప్రకటనలో తెలియజేసింది. మరి ఈ ఆడిషన్స్ తిరుపతి లో మేక్ మై బేబీ జీనియస్ స్కూల్, న్యూ బాలాజీ కాలని లో ఈ ఆడిషన్ లు జూలై 3 , 4 , 5 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: