నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా సత్తా చాటి నిర్మాతగా సక్సెస్ అయిన దిల్ రాజు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే ఆడియెన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూసేలా చేసుకున్నారు.ఇకపోతే ఈయన కంటెంట్ ఉన్న సినిమాలతో పాటుగా కమర్షియల్ సినిమాలను కూడా చేస్తూ వచ్చారు దిల్ రాజు.అయితే  నిర్మాతగా ఒక రేంజ్ లో ఫాం లో ఉన్న దిల్ రాజు పరిశ్రమ కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే  ఇక దిల్ రాజు ఓ కొత్త స్టూడియో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.కాగా  శంషాబాద్ ఏరియాలో దిల్ రాజు భారీ స్టూడియో ఒకటి నిర్మించాలని చూస్తున్నారట.అయితే  నిర్మాతగా తన టేస్ట్ ఏంటో తెలియచేస్తూ వరుస క్రేజీ సినిమాలు చేస్తున్న దిల్ రాజు స్టూడియో కూడా సినిమాలకు అన్ని ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారట. పోతే ఇప్పటికే తెలుగు సినిమాలే కాకుండ ఇతర పరిశ్రమలకు హైదరాబాద్ ఒక వేదిక అవుతుంది.అయితే ఇదేదారిలో దిల్ రాజు కూడా భారీ స్టూడియోని ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే దిల్ రాజు నిర్మించే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాం చరణ్, శంకర్ కాంబో సినిమా ఒకటి సెట్స్ మీద ఉంది.

ఇక  ఆ సినిమా భారీ బడ్జెట్ తోనే చేస్తున్నారు.కాగా  ఆ మూవీతో పాటుగా దళపతి విజయ్ తో వారసుడు సినిమా కూడా చేస్తున్నాడు దిల్ రాజు.అయితే  ఈ రెండు సినిమాలతో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు దిల్ రాజు.ఇక నిర్మాతగా ఎప్పుడూ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చిన దిల్ రాజు ఈ రెండు సినిమాలతో నేషనల్ లెవల్ లో నిర్మాతగా తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. ఇదిలావుంటే ఈ రెండు హిట్ అయితే దిల్ రాజు రానున్న రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: