అందాల ముద్దు గుమ్మ ప్రియా ఆనంద్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరో గా తెరకెక్కిన లీడర్ మూవీ తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది.

సినిమా మంచి విజయం సాధించడంతో ప్రియా ఆనంద్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆతర్వాత ఈ ముద్దు గుమ్మ శర్వానంద్ హీరోగా తెరకెక్కిన కో అంటే కోటి మూవీ లో  హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ప్రియా ఆనంద్ పర్వాలేదు అనే రేంజ్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను సాధించింది. ఇది ఇలా ఉంటే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రియ ఆనంద్ మరి కొన్ని రోజుల్లో  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ప్రియా ఆనంద్ 'మా నీళ్ల ట్యాంక్' అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ లో సుశాంత్ హీరోగా నటించాడు.

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ వెబ్ సిరీస్  ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో జూలై 15 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బోతున్న ప్రియా ఆనంద్ ఈ వెబ్ సిరీస్ తో ఎలాంటి గుర్తింపు ను తెచ్చుకుంటుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: