దొరసాని సినిమా తో ఆనంద్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాడు. ఆ సినిమా పర్వాలేదనిపించుకోగా నటుడిగా ప్రేక్షకులలో మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత అయన చేసిన నెక్స్ట్ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి విజయాన్ని అందుకుంది. కరోనా కారణంగా ధియేటర్ లో విడుదల చేయకపోవడం తో ఓటీటీ లో ఈ సినిమా ను విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది. అలా ఈ సినిమా కు ప్రేక్షకులు భారీగా ఓట్లు వేశారు. ఆ తరువాత అయన చేసిన చిత్రం పుష్పక విమానం సినిమా థియేటర్ లలో విడుదల కాగా అది కొంత నిరాశపరిచింది అని చెప్పొచ్చు.
ఇకపోతే ఇప్పుడు అయన హైవే సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కెవి గుహన్ ఈ సినిమా కి దర్శకత్వం వహించాడు. చాలారోజుల తరువాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ విధంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆహా లో ఈ సినిమా ను ఈనెల 19 న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మరి ఈ నెల వీరికి కలిసి వస్తుందా అనేది చూడాలి. ఆనంద్ దేవరకొండ ఈ సినిమా పట్ల మంచి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు.