మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక తన భర్త రామ్ చరణ్ కూడా వృత్తిపరమైన విశేషాలతో పాటు సోషల్ మీడియాలో పలు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక స్పెషల్ డేస్ సెలబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కుటుంబంలో జరిగే ప్రతి పండుగను ఈవెంట్ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.. తాజాగా ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


ఇంట్లో దేవుడు గదిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి దేవుడు ఫోటోలు పూలమాల పళ్ళు పలహారాలతో చాలా అందంగా ముస్తాబు చేసినట్లుగా కనిపిస్తోంది..అనంతరం ఉపాసన రామ్ చరణ్ దంపతులు ప్రత్యేకమైన పూజలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.అలా పూజ అనంతరం ఇలా తన సతీమణికి నుదుటిన చరణ్ కుంకుమ బొట్టు పెట్టడం చూడవచ్చు. అలాగే సాంప్రదాయమైన దుస్తులలో ఉపాసన కనిపించారు ఇక రామ్ చరణ్ కూడా బ్లాక్ కలర్ టీ షర్టు కూడా ధరించి పంచ కట్టులో కనిపించారు కృష్ణాష్టమి రోజున చివరి వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఇలా అన్నీ కలిసి వచ్చింది.

ఈ సందర్భంగా అన్ని రకాల పండుగ శుభాకాంక్షలు ఇంస్టాగ్రామ్ లో అభిమానుల సైతం తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి ఆమె అభిమానులు వీరిద్దరిని ఇలా చూసి చాలా మురిసిపోతున్నారు ఇది చాలా రేర్ పిక్ దీంతో సంథింగ్ స్పెషల్ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా అవుతున్నాయి. ఇక హిందూ సాంప్రదాయ పద్ధతులలోనే మెగా కుటుంబంలోని ప్రతి పండుగ కూడా ప్రతియేటా నిర్వహిస్తూ ఉంటారు. గత ఏడాది వరలక్ష్మి దేవి వ్రతాన్ని ఉపాసన అత్తగారు సురేఖ అంజన దేవితో కలిసి జరుపుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: