మంచి టాలెంట్ ఉన్న నటుల్లో ఒకరు అయినా దుల్కర్ సల్మాన్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . దుల్కర్ సల్మాన్ , నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి మూవీ లో జెమినీ గణేషన్ అనే పాత్ర లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు .

ఇది ఇలా ఉంటే తాజా గా దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' అనే మరో తెలుగు మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ లో మృణాళినీ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా , హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . వైజయంతి మూవీస్ ,  స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని అశ్వనీదత్ నిర్మించారు . ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఇలా దుల్కర్ సల్మాన్ తెలుగు లో నటించిన రెండు సినిమా లు కూడా బ్లాక్బస్టర్ విజయాలను అందుకోవడం తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో  కూడా దుల్కర్ సల్మాన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇది ఇలా ఉంటే దుల్కర్ సల్మాన్ కొంత కాలం క్రితం కురుప్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 112 కోట్ల కలెక్షన్ లను రాబట్టి బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కురుప్ సినిమా శాటిలైట్ హక్కులను భారీ మొత్తం ధర చెల్లించి జీ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ భార్యగా సబితా ధూళిపాల నటించగా , శ్రీనాథ్ రాజేంద్రన్మూవీ  కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: