తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా , పూజా హెగ్డేమూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 13 వ తేదీన బీస్ట్ మూవీ తమిళ్ , తెలుగు ,  కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది.  భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే బాక్సా ఫీస్ దగ్గర ఆవరేజ్ మూవీ గా మిగిలి పోయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించ బోతోంది. 

మూవీ తెలుగు లో జెమినీ టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆదివారం రోజు అనగా ఆగస్ట్ 28 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను జెమినీ టీవీ నిర్వహణ బృందం తాజాగా ప్రకటించింది.  మరి  ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమిళం లో ఈ మూవీ వరిసు టైటిల్ తో తెరకెక్కుతు ఉండగా , ఈ సినిమా తెలుగు లో వారసుడు టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ,   ఎస్ ఎస్ తమన్మూవీ కె8 సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: