పూరి జగన్నాథ్… విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈరోజు(ఆగస్టు 25న) విడుదలైన ఆ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది.


అయితే ఓపెనింగ్స్ మాత్రం భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి ముఖ్య కారణం సినిమా రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్లు చేయడం వల్లనే అని చెప్పాలి. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేసిందట పూరి అండ్ టీం.


ఇదే క్రమంలో పూరి కొన్ని ఆసక్తికరమైన విషయాల పై కూడా స్పందించినట్టు ప్రచారం జరిగింది. అభిషేక్ బచ్చన్ కు గతంలో ఆయన 'ఇడియట్' 'అమ్మ నాన్నతమిళ అమ్మాయి' కథ వినిపించాడట. పనిలో పనిగా 'పోకిరి' కథ కూడా చెప్పాడట. కానీ పూరి చెప్పిన ఏ కథకి కూడా అభిషేక్ బచ్చన్ ఓకే చెప్పలేదట. అయితే పూరి తెరకెక్కించిన 'పోకిరి' చిత్రం హిందీలో 'వాంటెడ్' గా రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.


 


సల్మాన్ ఖాన్ పనైపోయింది అనుకున్న టైంలో అతనికి మళ్ళీ లైఫ్ ఇచ్చింది ఈ చిత్రమే. ఇదిలా ఉండగా.. పూరికి 'బిజినెస్ మెన్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన కూడా ఉందట. తెలుగులో ఆ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటించాడు. హిందీలో హీరో ఎవరు అన్న విషయం పై పూరి స్పందించలేదు. అయితే 'బిజినెస్ మెన్' హిందీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నట్టు ప్రచారం కూడా మొదలైంది. 'జులాయి' లో వర్షం ఎపిసోడ్ తో ఓ కాఫీ హోటల్ లో కామెడీ సీన్ ఉంటుంది.


 


దానిని ఆధారం చేసుకుని ఓ నెటిజెన్ మీమ్ చేశాడు. అందులో అల్లు అర్జున్ ప్లేస్ లో పూరి ని ఉంచి.. సరదాగా 'బిజినెస్ మెన్' ను హిందీలో రీమేక్ చేద్దామా అని ఇలియానా ప్లేస్ లో ఉన్న ఛార్మి ని అడుగుతున్నట్టు ఆ మీమ్ డిజైన్ చేశాడట.. అప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆశగా ఎదురుచూస్తున్నట్టు ఆ మీమ్ ఉంది. ఆల్రెడీ అతను 'ఛత్రపతి' హిందీ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: