డైరెక్టర్ హానురాగపూడి తాజాగా తెరకెక్కించిన చిత్రం.. సీతారామం. ఈ చిత్రంలో హీరోగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ నటించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఇక ఇందులో ముఖ్యమైన పాత్రలో రష్మిక కూడా నటించింది.. ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయస్తురాలు అయ్యింది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. తన ఫస్ట్ సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులలో బాగా గుర్తుండిపోయే నటనను ప్రదర్శించింది. మొదట మృణాల్ బాలీవుడ్లో పలు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం వెండితెర పైన కూడా తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నది ఇక బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ..తెలుగులో కూడా వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తున్నది ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన మొదటి చిత్రమే మంచి విజయం కావడంతో తన రెమ్యూనరేషన్ పెంచేసిందని టాక్ వినిపిస్తున్నది. ఇక ఈమె పెంచిన రెమ్యూనరేషన్ కూడా నిర్మాతలకు ఎక్కువగా అనిపించకపోవడంతో నిర్మాతలు కూడా ఓకే అంటున్నారట.


ప్రస్తుతం ఒక్కో చిత్రానికి మృనాల్ కోటి రూపాయలు అడుగుతున్నట్లుగా సమాచారం. ఇక సీతారామం సినిమాని నిర్మించిన వైజయంతి బ్యానర్ పైన ఈమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. డైరెక్టర్ బివి నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో హీరోగా దుల్కర్ సల్మాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సినిమాలో ఈమె కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో మృణాల ఠాగూర్ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం. మరి ఈ ముద్దుగుమ్మ ఇలాగే మంచి సక్సెస్ లతో దూసుకుపోయింది అంటే స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు. మరి అభిమానుల ఆశ నెరవేరుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: