డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాడు అని అంటూ ఉంటారు కదా.. ఇది మాటవరసకు ఎవరు అన్నారో తెలియదు కానీ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతోమంది విషయంలో ఇది నిజం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పటికే సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఒకవైపు డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు హీరోయిన్ గా కూడా వరుస అవకాశాలు అందుకుంటూ రాణిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ హీరోయిన్ కూడా డాక్టర్ అవ్వ బోయ యాక్టర్ అయ్యింది అన్న విషయం ఇపుడు హాట్ టాపిక్గా మారిపోయింది.


 ఆ అమ్మాయి ఎవరో కాదు సీతారామం సినిమాలో తన అందం అభినయంతో సౌత్లో ప్రేక్షకులందరినీ కూడా కట్టిపడేసిన మృణాల్ ఠాకూర్. ఇటీవల విడుదలైన సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించింది. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే ఊహించని రీతిలో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో వరుస  అవకాశాలు ఈ అమ్మడి తలుపు తడుతున్నాయి. టాలీవుడ్ లోనే ఒక స్టార్ హీరో సరసన నటించే అవకాశం అందుకున్నట్లు టాక్ కూడా వినిపిస్తోంది. మొదట బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ ఇక సీతారామం తర్వాత హీరోయిన్ గా మారిపోయింది.


 మొదటి సినిమాతోనే ప్రేక్షకులు అందరి చూపులు తన వైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మృనాల్ ఠాకూర్ మాట్లాడుతూ డాక్టర్ కావాల్సిన నేను యాక్టర్ అయ్యాను. నిజానికి నేను డెంటిస్ట్ కోర్స్ చేశాను. అందుకోసం రాసిన ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు కూడా వచ్చాయి. కానీ నాకు డాక్టర్ అయ్యే కన్నా నటి అవ్వాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. కానీ అందుకు మా అమ్మ నాన్న ఒప్పుకునేవారు కాదు.  కానీ ఎలాగైనా ఒప్పించాలని  నిర్ణయించుకొని.. త్రీ ఇడియట్ సినిమా చూపించాను.. నచ్చిన పని చేయాలనే సందేశం వారికి నచ్చింది. తర్వాత సినిమాల్లోకి  వెళ్లడానికి నన్ను ప్రోత్సహించారు అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: