అయితే ఈ చిత్రం తర్వాత శ్రీనిధి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం . అందుకు కారణం ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడం కారణమన్నట్లుగా తెలుస్తోంది. అయితే రీసెంట్గా విక్రంతో కోబ్రా సినిమాలో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి నటించిన సినిమా ఇదే. ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యాక్షన్, థ్రిల్లర్ , సస్పెన్షన్ గా తెరకెక్కింది. ఈ చిత్రం గత నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
మొదటి షో నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో చేసేదేమీ లేక ఈ చిత్రాన్ని లైట్ గా తీసుకొని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఇకపోతే కేజిఎఫ్ మాదిరిగానే ఈ సినిమా కూడా తనకు బ్లాక్ పాస్టర్ హిట్ అయింటే తన కెరియర్ వేరే లాగా ఉండేది. తను అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు సైతం ముందుకు వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకునీ కోబ్రా సినిమాలో నటించింది . కానీ కోబ్రా సినిమా ఆమె ఆశలను నిరాశలు చేసింది. మరి ఈ ముద్దుగుమ్మ దిగి వస్తుందో లేదో చూడాలి.