చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ మరియు హాలీవుడ్ స్టార్స్తో జతకట్టేస్తున్న నటి కృతిశెట్టి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మంగళరు భామ ఈమె
ఆ చిత్రంతో కృతిశెట్టి దశ మారిపోయింది. ఆ తరువాత తెలుగులో శ్యాంసింగరాయ్, బంగార్రాజు వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి మరింత పాపులర్ అయ్యింది కూడా అంతే కాకుండా తెలుగులో నటిస్తూనే కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రపొందిన ది వారియర్ చిత్రంలో నటుడు రామ్కు జంటగా నటించింది.
తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కింన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, అందులో నటుడు శింబు పాడిన బుల్లెట్ పాట సూపర్ హిట్గా నిలిచింది. అందులో నటించిన కృతిశెట్టి కి తమిళంలోనూ క్రేజ్ తెచ్చి పెట్టింది. దీంతో ఇక్కడ వెంట వెంటనే నటుడు సర్య, నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాలను కూడా దక్కించుకుంది. బాలా దర్శకత్వంలో సర్య నటిస్తున్న వణంగాన్ చిత్రంలో న, వెంకట్ ప్రభు దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలోనూ నటిస్తోందట..
కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటింంది. వారు అడిగిన ప్రశ్నల కు చకచకా బదులిచ్చింది. అలా ఒక అభిమాని నటుడు అజిత్, విజయ్ల గురించి ఒక మాటలో చెప్పాలని అడగ్గా అజిత్ జెన్యూన్ పర్శన్ అని విన్నానని, అదేవిధంగా నటుడు విజయ్ ఇన్స్పైరింగ్ స్టార్ అని పేర్కొంది. ఇక మహేష్ గురించి తెలుపు తూ.. ఆయన రియల్గా ను, రీల్లోనూ సూపర్స్టార్ అని చెప్పుకొచ్చింది
ఇప్పటికే వరుస ఆఫర్ ల తో కృతి శెట్టి దూసుకుపోతుంది. కానీ ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా తెచ్చుకోలేకపోయింది.తరువాత రాబోయే చిత్రాలు అయినా ఎలా వుంటాయో చూడాలి.కమర్షియల్ హిట్ ఒకటి కనుక పడితే కృతి రేంజ్ ఎక్కడి కో వెళ్తుంది. బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లను సంపాదిస్తుంది.