చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్నారు. అయితే గత చిత్రం ఆచార్య డిజాస్టర్ తో మెగా అభిమానులకు సైతం తీవ్రమైన నిరాశని మిగిల్చారు. అయితే ఇప్పుడు మలయాళం నుంచి లూసీ ఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసి విడుదల చేయబోతున్నారు.ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయబోతున్నారు.సినిమా లో చిరంజీవి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండేది. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల డేట్ ని కూడా చిత్ర బృందం కన్ఫామ్ చేసింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ని వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పూరి జగన్నాథ్, సత్యదేవ్, నయనతార సునీల్ తదితరులు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం లో సల్మాన్ ఖాన్ పై ఒక మాస్ సాంగ్ కూడా ఉన్నదని ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది అని చిత్ర బృందం చాలా నమ్మకంగా తెలియజేస్తున్నారు .అంతేకాకుండా గాడ్ ఫాదర్ సినిమా బాలీవుడ్ లో కూడా విడుదల చేయబోతున్నామని తెలిపారు.

ఇటీవల కాలంలోనే తెలుగు సినిమాలు బాలీవుడ్ లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. కేవలం తెలుగు సినిమాలు అక్కడ బాగా మంచి కలెక్షన్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాను బాలీవుడ్ లో రీమిక్స్ చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఒక ప్రకటన వెలుగుబడింది.అయితే చిరంజీవికి బాలీవుడ్లో అంతగా క్రేజీ లేదని చెప్పవచ్చు. మరి సల్మాన్ ఖాన్ తోనే ఈ సినిమాని బాలీవుడ్ లో నెట్టుకొస్తారేమో చూడాలి. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం ఈ సినిమా బాలీవుడ్ లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: