ఈ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన తెలుగు మూవీ లలో డీజే టిల్లు మూవీ ఒకటి. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించగా ,  నేహా శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. విమల్ కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. చిన్న మూవీ గా విడుదల అయిన డీజే టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి అద్భుత మైన కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

మూవీ లో సిద్దు జొన్నలగడ్డ నటన అద్భుతంగా నిలిచింది. సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీ లో తన డిఫరెంట్ స్టైల్ ఆటిట్యూడ్ తో ,  బాడీ లాంగ్వేజ్ తో అదిరి పోయే రేంజ్ లో కామెడీ ని పండించాడు. అలాగే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి కూడా తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. డీజే టిల్లు మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. శ్రీ చరణ్ పాకాలమూవీ కి అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది.  

ఇది ఇలా ఉంటే డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి సీక్వెల్ గా డీజే టిల్లు పార్ట్ 2 ను తెరకెక్కించ బోతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డీ జే టిల్లు పార్ట్ 2 మూవీ షూటింగ్ నిన్నటి నుండే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. డీజే టిల్లు పార్ట్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లు ఈ మూవీ దర్శకుడు విమల కృష్ణ సోషల్ మీడియా ద్వారా తెలియ జేశాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో డీజే టిల్లు పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: