మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ "నేను శైలజ" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ,  మొదటి మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా , తన నటన తో ,  అందచందాలతో ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఆ తర్వాత నేను లోకల్ , మహానటి మూవీ లతో వరస విజయలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కీర్తి సురేష్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు లో దసరా అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ లో నాని హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళ్ లో కూడా కీర్తి సురేష్ వరస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా మరో క్రేజీ మూవీ లో అవకాశాన్ని దక్కించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆకాశమే నీ హద్దురా మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో కీర్తి సురేష్ అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఉంటే ఈ మూవీ లో తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న శింబు హీరో గా నటించబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: