రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ లలో వర్షం సినిమా ఒకటి. 2004 వ సంవత్సరంలో విడుదల అయిన వర్షం మూవీ అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని  అదిరిపోయే కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. 

మూవీ లో ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో వీరిద్దరి జంటకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి శోభన్ దర్శకత్వం వహించగా ,  సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీ ని ఎం ఎస్ రాజు నిర్మించాడు. ఈ మూవీ లో గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లో గోపీచంద్ పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది.

మూవీ ద్వారా ప్రభాస్ కి త్రిష కు అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇలా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వర్షం మూవీ ని మరి కొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలవడింది. అక్టోబర్ 28 వ తేదీన వర్షం మూవీ ని తిరిగి గ్రాండ్ గ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లోని కొంత మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయి ప్రేక్షకులను అత్యంత అలరించాయి. మరి వర్షం సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: