అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధిస్తోంది కన్నడ సినిమా కాంతార. అంతేకాదు కాసుల పండ పండిస్తున్న ఈ మూవీ కాన్సెప్ట్ కు పెద్ద పెద్దవాళ్లంతా పడిపోయారు.ఇక  అప్పట్లో కెజియఫ్ లాగా సైలెంట్ గా వచ్చి.. ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది.అయితే  రిషబ్ శెట్టి నటించి.. ఆయనే స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండియా వైడ్ గా సెలబ్రెటీలను సైతం మెస్మరైజ్ చేస్తోంది.ఇదిలావుంటే ఇక ప్రతీ విషయంలో తన దైన స్టైల్ లో స్పందించే బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా ఈమూవీ పై కూడా స్పందించారు. 

అయితే కాంతారా మూవీపై ప్రశంసల జల్లు కురిపించింది కంగనా రనౌత్. ఇక తను ఒక్కతే కాకుండా తన ఫ్యామిలీ అంతా కలిసి ఈ మూవీ చూసినట్టు ప్రకటించింది కంగనా. కాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేధికగా వెల్లడించింది.ఈమె ...కుటుంబ సభ్యులతో కలిసి కాంతార సినిమా చూశా.అంతేకాదు  ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం.ఇక  సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈమూవీ కి మూల స్థంభం రిషబ్‌ శెట్టి గురించి ఏం చెప్పాలి. అయితే ఆయనకి హ్యాట్సఫ్‌. రచన, దర్శకత్వం, 

నటన.. అన్నీ మరో స్థాయిలో ఉన్నాయి.అంతేకాదు  ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్‌ సీన్స్ మేకింగ్ .. స్క్రీన్ ప్లే.. ఓవర్ ఆల్ గా ఈసినిమా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమా అంటే ఇది.. ఇలానే ఉండాలి అంటూ కంగనా అన్నారు.ఇప్పటి వరకు తాను చాలా సినిమాలు చూశానని . ఇక ఇలాంటి అద్భుతమైన సినిమాను ఎప్పుడూ తాను చూడలేదంటూ చెప్పిన కంగనా.అయితే  ఇదే అభిప్రాయం సినిమా చూసి బయటకు వస్తున్న కొందరు ప్రేక్షకులు అనుకుంటుండటం నేను విన్నాను. ఇక ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. అంతేకాదు మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది కంగనా రనౌత్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: