ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ల లో ఒకరు శ్రీయ..ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ తనకు నచ్చిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.తనకు నచ్చినట్టు ఉండటంలో తప్పేంటని ప్రశ్నిస్తోంది. సాధారణంగా సినిమా స్టార్స్ లీడ్ చేసే లైఫ్..కామన్ పీపుల్ లీడ్ చేసే లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డబ్బులున్న స్టార్స్ పబ్లిక్‌గా ఏది చేసినా ఎవరూ తప్పపట్టరు. కానీ అదే సామాన్యులు చేస్తే మాత్రం తోటి వారే ఏదో ఒకటి అంటూ విమర్శలు గుప్పిస్తారు. శ్రియ ఒక దశాబ్దం కంటే ఎక్కువగానే టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలు చేసింది.


ఆఖరుకు కుర్రహీరోలతోనూ రొమాన్స్ చేసింది. ఒకానొక టైంలో ఐటం సాంగ్స్ కూడా చేసిన శ్రియ తన కెరీర్ డౌన్ అవుతున్న టైంలో ఫారిన్ వ్యక్తి ఆండ్రీని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. శ్రియ తెలుగు వారిని లేదా ఎవరైనా బిజినెస్ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా విదేశీయుడిని పెళ్లి చేసుకున్న శ్రియ.. రీసెంట్‌గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ ప్రస్తుతం సినిమాలు తగ్గించి తన మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది..


దివాళీ ఫెస్ట్ సందర్భంగా బాలీవుడ్ యాక్టర్ శిల్పాశెట్టి దివాళీ బాష్‌లో జంటగా మెరిసింది 40 ఏళ్ల శ్రియ.. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్నారు. సెలబ్రిటీలు అందరూ ముందుండగా శ్రియ, ఆండ్రీ లిప్ కిస్ పెట్టుకుని తమ దాంపత్య అన్యోన్యతను ప్రపంచానికి చాటారు. అక్కడే లాక్మే ఫ్యాషన్ వీక్ కూడా అదే రోజు రాత్రి జరిగింది. ఎంతమంది పక్కన ఉన్న ఈ జంట మాత్రం అస్సలు తగ్గలేదు. శ్రియ కపుల్ రొమాన్స్ చూసిన వారంతా ఫిదా అయిపోయారు.కపుల్ అంటే వీరిలాగా ఉండాలని కొందరు కామెంట్స్ చేశారు.. మొత్తానికి ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: