టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఊర మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు బోయపాటి శ్రీను కేరాఫ్ గా నిలుస్తారు. 'భద్ర' సినిమాలతో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి శ్రీను తొలి సినిమానే డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్నారు.ఆ తర్వాత నుంచి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను గుర్తింపు తెచ్చుకున్నారు.ముఖ్యంగా బోయపాటి-బాలయ్య కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. 'సింహ'..'లెజండ్'.. 'అఖండ' వంటి వరుస బ్లాక్ బస్టర్స్ వీరి కాంబినేషన్లో వచ్చాయి. దీంతో బోయపాటి-బాలయ్య కలిశారంటే బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకం ప్రతీ ఒక్కరిలోనూ ఏర్పడింది. 'అఖండ'తో బాక్సాఫీస్ విజయం అందుకున్న బోయపాటి తన తరువాత చిత్రాన్ని ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేనితో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ కోసం ఏకంగా మిస్ ఇండియానే రంగంలోకి దించుతున్నారని టాక్ విన్పిస్తోంది. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.వెంకటేష్ 'తులసి' సినిమాలో శ్రియ శరణ్ తో 'చికుచికు బండినిరోయ్..' అల్లు అర్జున్ 'సరైనోడు'లో అంజలితో 'బ్లాక్ బస్టర్.. బ్లాక్ బస్టరే'.. రామ్ చరణ్ 'వినయవిధేయరామ'లో ఈషా గుప్తాతో ఏక్ బార్ ఏక్ బార్.. అనే మాస్ మసాలా సాంగ్స్ చేశారు.


తాజాగా రామ్ పోతినేని సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ నే ప్లాన్ చేస్తున్నారు.ఇందుకోసం ఏకంగా మాజీ మిస్ ఇండియా విజేత  బాలీవుడ్ అల్ట్రా హాట్ నటి అయిన ఊర్వశి రౌతేలాను సంప్రదించినట్లు తెలుస్తోంది.బాలీవుడ్లో నటిగా తన హాట్ అందాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఊర్వశి రౌతేలా. ఆమె పలు సినిమాల్లో హిట్ ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది. ఈ మేరకు రామ్ పోతినేని సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది. ఊర్వశి రౌతేలా నటించిన తాజా చిత్రం 'బ్లాక్ రోజ్' త్వరలోనే హిందీ.. తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది.ఇటీవల సోషల్ మీడియాలో ఊర్వశి ఇంకా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం అయితే చాలా హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఈమధ్య చాలా గొడవ పడ్డారు. వారిద్దరికీ చాలా రోజుల నుంచి ఎఫైర్ ఉందని మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: