ఫ్లాప్ అయినా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు సినిమాలలో 'శక్తి' సినిమా కూడా ఒకటి. 'శక్తి' సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిందిఈ సినిమా విడుదలై ఇప్పటికే 10 సంవత్సరాలు దాటింది. అయినా కూడా 'శక్తి' సినిమా తాలూకు చేదు జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అంత ట్రోలింగ్ జరిగిందో చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ ఎన్టీఆర్‌కి యాంటీగా ఉన్న కొంతమంది మంది మాత్రం హ్యాష్ టాగ్ పెట్టి మరీ అప్పుడప్పుడు ట్రోల్ల్స్ చేస్తున్నారు.శక్తి సినిమాతో డైరెక్టర్ మోహర్ రమేష్ పతనం స్టార్ట్ అయింది. మోహర్ రమేష్ ఈ సినిమా తరువాత షాడో సినిమా తీశాడు. అది కూడా ఫ్లాప్ అవడంతో అతనితో సినిమాలు తీయడానికి ఏ నిర్మాత ధైర్యం చేయలేదు. దాంతో అతడు చాలా కాలం సినిమాలు చేయలేక ఖాళీగానే ఉండిపోయాడు. కాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మోహన్ రమేష్ పై కాస్త కరుణించి రీమేక్ మూవీ అయిన 'భోళా శంకర్' సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. భోళా శంకర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాల్సిన మోహర్ రమేష్, దానికంటే ముందు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాడు.

తాజాగా అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'శక్తి సినిమాని 'మెషిన్ ఇంపాజిబుల్' వలె ఓ అద్భుతమైన యాక్షన్ సినిమాగా తీయాలని అనుకున్నట్టుగా చెప్పాడు. మొదట ఎన్టీఆర్, అశ్వినీ దత్‌లకు అతను చెప్పిన కథ కూడా వేరు అని అన్నాడు. అతడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దత్ నాకు యండమూరి వీరేంద్రనాథ్, గంధం నాగరాజు లాంటి ఉద్దాండులైనా రైటర్స్‌ని ఇచ్చారు. దాంతో వారు కథలో భక్తి కోణాన్ని తీసుకొచ్చారు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది' అని చెప్పారు.ఆ భక్తి కోణం బాగోలేదని చెప్పినా.. పాత కథతోనే సినిమా చేద్దామని కోరినా ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదట. దాంతో ఇది ఫ్లాప్ అవుతుందని తనకి ముందే తెలిసిపోయిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: