అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాలో రణబీర్ కపూర్ ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో నాగార్జున కీలకమైన పాత్రలో నటించారు ఈ సినిమా నవంబర్ 4వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ చిత్రం తెలుగు ఆడియోస్ నుంచి మంచి స్పందన లభిస్తుంది థియేటర్లో మిస్సయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటి లో ఈ సినిమాని చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
మరొకవైపు లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఒక హిస్టారికల్ సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రంలో త్రిష ,కార్తీ ,జయం రవి, విక్రమ్, శోభిత దూలిపల్లి, ఐశ్వర్యారాయ్ తదితరులు నటించారు. ఈ చిత్రం చోళుల కాలం నాటి కథ అంశంతో తెరకెక్కించారు తమిళంలో భారీ విజయాన్ని అందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవ్వగా అంతగా ఆకట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. అయితే బ్రహ్మాస్త్రం సినిమానీ ఎంతో ఆతృతగా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు కానీ ps -1 సినిమాని పెద్దగా పట్టించుకోలేదట.