టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ,  శ్రీ కార్తిక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వెన్నెల కిషోర్ , ప్రియదర్శిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా ,  అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... శర్వానంద్ "జాను" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత ,  శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. తాజా ఇంటర్వ్యూ లో జాను సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి శర్వానంద్ తెలియజేస్తూ ...  జాను మూవీ లోని లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ షూటింగ్ కోసం ఫ్లైట్ నుంచి స్కై డ్రైవింగ్ చేయాలి ,  దాని కోసం శిక్షణ కూడా తీసుకున్నాను. విమానం 15 అడుగుల ఎత్తున ఉన్నప్పుడు దూకేసా ,  కానీ పారాషూట్ తెచ్చుకోలేదు.  కిందపడడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. చేతికి రెండు ప్లేట్లు వేసి ,  24 నట్లు బిగించారు.  కాలికి ఒక ప్లేట్ వేశారు. కోలుకోవడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది అని శర్వానంద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: