మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను ఇండస్ట్రీకి అందించారు.. ఆయన సినిమాలు ఒక మార్క్ తో ఉంటాయి..త్రివిక్రమ్ మాటల్లోనే పరాక్రమం.. ప్రేమ.. అప్యాయత కలబోసి ఉంటాయి. ఎంతంటి కఠిన పరిస్థితినైనా..మాటలతో సున్నితంగా చెప్పేస్తాడు. ఓ ప్రేమికుడు ఎలా ఉండాలి..కొడుకుకు తండ్రి విలువలు కాపాడాల్సిన అవసరం ఏంటీ.. అనేది ఈతరం ప్రేక్షకుడి మనసును ఆకట్టుకునే విధంగా చెప్పేస్తాడు. తన లతో ప్రజలను అలరిస్తాడు..నవ్విస్తాడు.. ఆలోచింపచేస్తాడు.. ఏడిపిస్తాడు..


త్రివిక్రమ్ రాసే మాటలకు మంత్రముగ్దులు కానివారండరు. అయితే ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు త్రివిక్రమ్.నువ్వే నువ్వే నుంచి..అలా వైకుంఠపురంలో వరకు ప్రతి ప్రత్యేకమే. కానీ ఒకటి గమనించారా.. త్రివిక్రమ్ ప్రతి లోని హీరోయిన్స్ ఎంతో అమాయకంగా..తింగరిగా ఉంటారు.నువ్వే నువ్వే చిత్రంలో శ్రియా ఎంతో అమాయకంగా కనిపిస్తూనే .. అంతలోనే ఎంతో తెలివైన అమ్మాయిగా ఉంటారు. ఇలా ఎందుకు అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి..


ఈ విషయంపై ఓసారి ఇంటర్వ్యూ లో త్రివిక్రమ్ చెప్పాడు..నేను పెరిగిన వాతావరణం గానీ.. నేను పెరిగిన వాతావరణం గానీ.. చూసిన స్త్రీలు గానీ కావచ్చు. ప్రస్తుతం జీవన విధానం మార్పులను బట్టి మనం ఓ శక్తివంతమైన మహిళను కోరుకుంటున్నాం. ఒకానొక కాలంలో చాలా సంవత్సరాలకు ఝాన్సీ లక్ష్మీ బాయ్ మరణించింది. మళ్లీ వంద సంవత్సరాల తర్వాత ఓ రుద్రమదేవి. తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసినవారే. కానీ ఇప్పుడు పరిస్థతులు ఆ విధంగా లేవు. ప్రేమించిన అమ్మాయిలపై యాసిడ్ పోయడం.. చంపేయం జరుగుతున్నాయి. నేను పెరిగిన వాతావరణంలో గానీ.. నా చుట్టుపక్కల ఉన్న అక్కచెల్లె్లు.. స్త్రీలను ఇంత భయంకరమైన పరిస్థితులలో చూడలేదు..నా చుట్టూ ఉన్న వాళ్ళ చూసి అలానే ఉండాలని సినిమా తీసారు..ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టా్ర్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: