తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి సుధీర్ వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ వర్మ , నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్వామి రారా మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ లో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. పెద్దగా ఇలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన స్వామి రారా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా దర్శకుడు సుధీర్ వర్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సుధీర్ వర్మ , నాగ చైతన్య హీరోగా దోచేయ్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ దర్శకుడు నిఖిల్ హీరోగా కేశవ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుధీర్ వర్మ , మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రవణాసుర అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే సుధీర్ వర్మ తన తదుపరి మూవీ ని ఇప్పటికే సెట్ చేసుకున్నాడు. తన తదుపరి మూవీ ని సుధీర్ వర్మ  , నిఖిల్ హీరో గా తెరకెక్కించ బోతున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడో మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి కార్తీక్ సంగీత దర్శకుడుగా పని చేయబోతున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయిక గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ పై బివిఎస్‌ఎన్ ప్రసాద్మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: