టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ దాటికి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం నిలబడలేకపోయారు..ఇక అఖండ వంటి సెన్సషనల్ హిట్ తర్వాత బాలయ్య బాబు రేంజ్ బాగా పెరిగిపోయింది..అయితే ఆయన రెమ్యూనరేషన్ కూడా మూడింతలు పెరిగింది..ఇకపోతే వరుసగా యువ దర్శకులతో సినిమాలు ఒప్పుకుంటూ నందమూరి ఫాన్స్ కి పూనకాలు రప్పిస్తున్నాడు..బాలయ్య బాబు కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచింది ఆహాలో ప్రసారం అవుతున్న 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో..ఇక ఈ షో ద్వారా ఆయన నేటి తరం యూత్ కి బాగా దగ్గరయ్యాడు.

ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో 'వీరసింహరెడ్డి' అనే సినిమా చేస్తున్న బాలయ్య ఈ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..అయితే ఇలా వరుసగా కుర్ర దర్శకులతో పని చేస్తూ బాలయ్య బాబు తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు..ఇదిలావుండగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఇద్దరు యువ దర్శకులు బాలయ్య బాబు డేట్స్ కోసం ప్రదక్షిణలు చేస్తునట్టు సమాచారం.ఇకపోతే గీత గోవిందం , సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాలతో మనల్ని అలరించిన పరశురామ్ పెట్ల తో బాలయ్య బాబు సినిమా ఒకటి ఫిక్స్ అయ్యిందని గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం..

అయితే 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పరశురామ్ పెట్ల ఈ విషయాన్నీ స్వయంగా తెలిపాడు..గీత ఆర్ట్స్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.. వీళ్లిద్దరి మధ్య స్టోరీ సిట్టింగ్స్ అయితే జరిగాయి కానీ బాలయ్య బాబు కి ఎందుకో కథ అనుకున్న రేంజ్ లో నచ్చలేదట..ఇదిలావుంటే కొన్ని కీలకమైన మార్పులు చేసి తీసుకొని రమ్మన్నట్టు సమాచారం..మరోపక్క 'c/o కంచెరపాలెం' దర్శకుడు వెంకటేష్ మహా చెప్పిన స్టోరీ బాలయ్య బాబు కి తెగ నచ్చేసిందట.ఇకపోతే కథలో కొత్తదనం..అయితే ఇద వరుకు తనని ఏ దర్శకుడు చూపించని కోణం లో వెంకటేష్ చూపించాలనుకోవడం తో బాలయ్య బాబు వెంకటేష్ మహా తో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నాడు..ఇక ఈ సినిమాని బాలయ్య బాబు తో లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన వారాహి మూవీస్ వారు తెరకెక్కిస్తున్నారు..కాగా అనిల్ రావిపూడి సినిమా తర్వాత అల్లు అరవింద్ కి డేట్స్ ఇచ్చిన బాలయ్య బాబు ఇలా సడన్ గా వేరే సినిమాకి కమిట్ అవ్వడం పై అల్లు అరవింద్ గారు నిరాశకి గురైయ్యారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: