మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయిన త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రిష ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం త్రిష టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరంల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే త్రిష తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వర్షం మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. వర్షం మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన శోభన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. గోపీచంద్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు ఎంతో భారీ స్థాయిలో ఈ మూవీ ని నిర్మించారు. వర్షం సినిమా ద్వారా రెబల్ స్టార్ ప్రభాస్ కు , త్రిష కు , గోపీచంద్ కు ,  దేవి శ్రీ ప్రసాద్ కు , దర్శకుడు శోభన్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. వర్షం సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఇది ఇలా ఉంటే అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను తాజాగా థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రీ రిలీజ్ పై త్రిష తాజాగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ప్రభాస్ తో చేసిన వర్షం మూవీ రిలీజ్ అయి 18 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా లేటెస్ట్ గా థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన అనంతరం ప్రస్తుతం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న ఈ హ్యాపీ మూమెంట్స్ చూస్తుంటే తనకు ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు లో తన తొలి మూవీ గా రిలీజ్ అయిన వర్షం ఎప్పటికీ అద్భుతమైన మెమొరీగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని త్రిష సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. త్రిష పోస్ట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: