మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కవలసిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది అన్న వార్తలు ఇప్పుడు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇటీవలే మహేష్ జిమ్లో చేస్తున్న వర్కౌట్ ఫోటో ను విడుదల చేసి సినిమా ఆగిపోలేదు అనే వార్తలు ప్రకటన చేసినప్పటికీ కూడా ఇలాంటి వార్తలు రావడం మహేష్ అభిమానులను ఎంతగానో ఆందోళన పరుస్తుంది. ఇటీవల ఆయన తండ్రి కృష్ణ మరణించడంతో ఆ మనోవేదనలో ఉన్న మహేష్ బాబు ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేస్తాడని అంటున్నారు.

కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకుని ఆ తరువాత డైరెక్ట్ గా రాజమౌళి సినిమాను మొదలుపెట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి అవాంతరం వస్తూనే ఉంది. కారణం ఏంటో తెలియదు కానీ ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత రెండవ షెడ్యూల్ ను మొదలు పెట్టలేదు. అవుట్ ఫుట్ విషయంలో కథ విషయంలో సంతృప్తిగా లేని మహేష్ బాబు ఈ చిత్రాన్ని హోల్ లో పెట్టాడట. అయితే మహేష్ బాబుతో త్రివిక్రమ్ కు ఉన్న సాన్నిహిత్యంతో ఒప్పించి మళ్ళీ ఈ సినిమాను మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఆ వెంటనే కృష్ణ చనిపోవడంతో ఇప్పుడు మహేష్ ఆలోచన పూర్తిగా మారిపోయింది అని అంటున్నారు.

ఏదేమైనా మహేష్ ఈ సినిమా విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి నుంచి ఈ సినిమాను మొదలుపెట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులను చేస్తూ ఉండడం విశేషం.  మరి ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా క్యాన్సల్ అవడం త్రివిక్రమ్ కి తలవంపులుగా ఉంది. ఇప్పుడు మహేష్ సినిమా కూడా అలా అయితే అయన పరువు ఇంకాస్త దిగజారుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ను ఏవిధంగా కాపదతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: